మహారాష్ట్రలో ఘోరప్రమాదం... 13 మంది దుర్మరణం

  • బుల్దానా జిల్లాలో ఘటన
  • సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవేపై బోల్తాపడిన టిప్పర్
  • ఐరన్ లోడుతో వెళుతున్న టిప్పర్
  • లోడుపై కూర్చున్న కూలీలు బలి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ పై కూర్చున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు. టిప్పర్ ఐరన్ లోడుతో ప్రయాణిస్తుండగా, కూలీలు ఐరన్ లోడుపై కూర్చున్నారు. వారందరూ సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.

Road Accident
Tipper
Samridhi Express Highway
Buldhana
Maharashtra

More Telugu News